స్వామిజిల పరిషద్ పెద్దల మార్గదర్శనం |
కృష్ణ జిల్లా కైకలూరు లో నాలుగు గ్రామాల నుండి 75 కుటుంబాలకు సంబందిచిన 325 గురు సభ్యులు క్రైస్తవం నుండి తమ స్వ ధర్మమైన హిండుత్వంలో కి యజ్ఞ కార్యక్రమం ద్వారా పునరాగమనం చెందారు , ఈ కార్యక్రమం కైకలూరు లోని దుర్గా మాత ఆలయ ప్రాంగణం లో శ్రీ శ్రీ శ్రీ పూజ్య సత్యానంద భారతి స్వామిజీ ( భువనేశ్వరి పీఠం , గన్నవరం ), శ్రీ శ్రీ శ్రీ శివ స్వామి మరియు అనేక సాదు సంతుల సమక్షంలో నిర్వహించ బడింది కార్యక్రమ తదుపరి సహా పంక్తి భోజనం లో అందరు కలసి బోజనం చేసారు .
సాముహిక యజ్ఞ కార్యక్రమ దృశ్యం |
ఈ కార్యక్రమంలో VHP జాతీయ ఉపాద్యక్షులు శ్రీ లోకనాథ శర్మ గారు మార్గ దర్శనం చేసారు మరియు VHP పుర్వంధ్ర ప్రాంత కార్యదర్శి శ్రీ హనుమంత రావ్, ప్రాంత ( పుర్వంధ్ర ప్రదేశ్ ) ధర్మ ప్రసార ప్రముఖ్ శ్రీ సంజీవయ్య గారు , ఇతర పెద్దలు పాల్గొన్నారు.
పాల్గొన్న ఆహుతులు |
కార్యక్రమ అనంతరం స్వధర్మం స్వీకరించిన తమ తోటి సహోదరుల పట్ల మిగిలిన గ్రామస్తులు సాదర అభిమానాలు ప్రదర్శించారు , పునరాగమనం చెందినా కుటుంబాలు చాలా సంతోషం వ్యక్తం చేస్తూ మన ధర్మం నుండి దూరమైన అనేక కుటుంబాలను కలసి తమ అనుభవాలను వ్యక్తం చేయాలని సంకల్పించారు
Source: www.vhpap.org
****
0 comments:
Post a Comment